Wednesday, May 22, 2024

అంత్యక్రియలకు వెళ్లి వస్తూ రోడ్డుప్రమాదంలో ఆరుగురు మృతి

- Advertisement -
- Advertisement -

Six members dead in Road accident

పాట్నా: బీహార్ లోని జుమైలో మంగళవారం తెల్లవారు జామున ట్రక్కు, కారు ఢీకొన్న ఘటనలో ఆరుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో నలుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. హల్సీ పోలీస్‌స్టేషన్ పరిధి లోని సికంద్రాషేక్‌పూర్ ప్రధాన రహదారిపై పిప్రా గ్రామ సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. జుమై లోని ఖైరా బ్లాక్ లోని నౌదిహాకు చెందిన కొందరు దహన సంస్కారాల కోసం పాట్నా వెళ్లారు. తిరిగి వస్తుండగా పిప్రా గ్రామ శివారులో కారును ట్రక్కు ఢీకొట్టింది. రెండు వాహనాలు ఎదురెదురుగా వచ్చి ఢీకొనడంతో ఆరుగురు సంఘటన స్థలంలోనే మృతి చెందారని పోలీసులు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News