- Advertisement -
ఏసిబి వలలో పంచాయతీ కార్యదర్శి
మనతెలంగాణ/వంగూరు: మండల పరిధిలోని రంగాపూర్ జూనియర్ పంచాయతీ కార్యదర్శి చింతకుంట్ల రామస్వామి లంచం తీసుకుంటూ ఏసిబి అధికారులకు మంగళవారం పట్టుబడ్డారు. ఏసిబి అదికారులు తెలిపిన వివరాల ప్రకారం రంగాపూర్ గ్రామానికి చెందిన సంకెళ్ళ రాము తన తల్లి పేరు మీద ఉన్న ఇంటిని తన పేరు మీద మ్యూటేషన్ చేయమని పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోగా పంచాయతీ కార్యదర్శి 6వేల రూపాయల లంచం డిమాండ్ చేయడమే కాకుండా ఇబ్బందులకు గురి చేసినట్లు తెలిపారు. దీంతో రాము ఏసిబిని ఆశ్రయించారు. ఏసిబి అధికారుల సూచన మేరకు రాము పంచాయతీ కార్యదర్శికి లంచం ఇస్తుండగా అధికారులు పట్టుకున్నారు. రసాయన పరీక్షలో పంచాయతీ కార్యదర్శి తీసుకున్నట్లు తేలిందని అధికారులు వివరించారు. లంచం తీసుకున్న నేరానికి పంచాయతీ కార్యదర్శి పై కేసు నమోదు చేసినట్లు ఏసిబి అధికారులు తెలిపారు.
- Advertisement -