Monday, April 29, 2024

తీరనున్న గిరిజనుల దశాబ్దాల నాటి కల

- Advertisement -
- Advertisement -

ఖమ్మం: ముందుగా అనుకున్న ప్రకారం ఈనె ల24 నుంచి పంపిణీ చేయాలని భావించినప్పటికి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ని ఆసిఫబాద్ లో నూ తనంగా నిర్మించిన సమీక్రత కలెక్టరేట్ భవనాన్ని ఈనెల 30న ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రారంభిస్తుండటంతో ఆ రోజే పోడు రైతులకు పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించారు.అటవీ భూములపై ఆధారపడిన వారికి భూ యాజమాన్య హక్కులు కల్పించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారని రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తెలిపా రు.

గతంలోనే దరఖాస్తులు స్వీకరించిన ప్రభుత్వం.. క్షేత్ర స్థాయిలో పరిశీలన పూర్తి చేసిందన్నారు.రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 406369 ఎకరాలకు గాను 1511 46 పోడు రైతులకు పట్టాలను పంపిణీ చేయనున్నారని ఆయన తెలిపారు. ఈ మేరకు రాష్ట్రంలోనే అత్యధికంగా పొడు వివాదం ఉన్న భద్రాద్రి కొత్తగూ డెం జిల్లాలో 1,51,195 ఎకరాలకు గాను 50,595 మంది గిరిజనులకు మంత్రి హరీష్ రావు తో కలిసి రాష్ట్ర రవాణ శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ పట్టాలను పంపిణీ చేయనున్నారు.ఇక రాష్ట్రవ్యాప్తంగా అదే రోజు పోడు భూముల పట్టాలు నియోజకవర్గాల వారీగా కలెక్టర్లు, మంత్రు లు, ఎమ్మెల్యేలు, ప్రజా ప్రతినిధులు సమక్షంలో పోడు పట్టాలను రాష్ట్రవ్యాప్తంగా ఒకే రోజు అందించనున్నట్లు మంత్రి పువ్వాడ తెలిపారు.పోడు పట్టాల పంపిణీతో అటవీ భూముల అన్యాక్రాంతానికి చెక్ పెట్టాలని సర్కారు నిర్ణయించిందని, తమ కమతాల చుట్టూ ఉన్న ఫారెస్టు భూముల రక్షణ సదరు పట్టాదారులకే అప్పగిస్తుందని, తద్వారా ఆక్రమణలకు అవకాశం లేకుండా కట్టడి చేయడం జరుగుతుందని అన్నారు.భవిష్యత్తులో అటవీ భూముల పరిరక్షణే ధ్యేయంగా అటవీ శాఖ ప్రణాళికలు సిద్ధం చేసిందని అన్నారు.
పోడుకు పట్టాలు ఇచ్చిన తర్వాత ఇకపై అంగుళం భూమి ఆక్రమణలకు గురి కాకుండా పక్కాగా చర్య లు తీసుకునేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నదని దశాబ్దాల పాటు పోడు భూముల్లో వ్యవసాయం చేసుకుంటూ పట్టాల కోసం ఎదురు చూస్తున్న పో డు రైతుల కలను సీఎం కేసీఆర్ సాకారం చేసారని రాష్ట్రవ్యాప్తంగా పోడు రైతులు అందరి తరపున మ ంత్రి పువ్వాడ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News