Monday, April 29, 2024

ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి

- Advertisement -
- Advertisement -

తలకొండపల్లి: ట్రాక్టర్ ప్రమాదంలో వ్యక్తి మృతి చెందిన సంఘటన తలకొండపల్లి మండలంలోని పడకల్ గ్రామంలో వెలు గు చూసింది. పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన చెవిటి మల్లేష్ (42) పొలం పనులకు వెళ్లగా ట్రాక్టర్ అదుపుతప్పిందని, ఈ ప్రమాదంలో మల్లేష్ తలకు తీవ్ర గాయాలయ్యాయని, దీంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడని పేర్కొన్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కో సం కల్వకుర్తి ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి భార్య, ముగ్గురు కుమారులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News