Thursday, May 16, 2024

ఎమ్మెల్సీ కవితకు ఆట మహాసభల ఆహ్వానం

- Advertisement -
- Advertisement -

టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో
కవితను కలిసిన ఆట ప్రతినిధులు

Aata mahasabhalu invitation to MLC Kavitha

మనతెలంగాణ/హైదరాబాద్:  టిఆర్‌ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల ఆధ్వర్యంలో ఆట ప్రతినిధుల బృందం 17 వ ఆట (American Telugu Association) మహాసభలకు రావాలని ఎమ్మెల్సీ కవితను మంగళవారం ఆహ్వానించారు. ఈ మహాసభలు వాషింగ్టన్ డీసీలో జూలై 1వ తేదీ నుంచి 3వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ సందర్భంగా ఆట ప్రతినిధులు మాట్లాడుతూ ఈసారి అమెరికా నలుమూలల నుంచి దాదాపు 15,000 మంది పాల్గొంటారని, ఈసారి తెలంగాణకు సంబంధించి మనఊరు -మనబడి, బతుకమ్మ, తెలంగాణ టూరిజానికి సంబంధించి వివిధ రకాల ఏర్పాట్లు చేయనున్నట్టు వారు పేర్కొన్నారు. ముందు తరానికి మన బతుకమ్మ విశిష్టత గురించి తెలియచేయడంతో పాటు బతుకమ్మ గురించి ఇంగ్లీష్‌లో పుస్తకాన్ని ముద్రిస్తున్నట్టు వారు తెలిపారు. తమ ఆహ్వానాన్ని స్వీకరించినందుకు కవితకు ఆట సభ్యులు ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మెల్సీ కవితను ఆహ్వానించిన వారిలో ఆట అధ్యక్షుడు భువనేశ్ భుజాల, శరత్ వేముల, జయంత్ చల్ల, వేణు సంకినేని తదితరులు ఉన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News