Saturday, April 27, 2024

తెలంగాణలో రేపు పాఠశాలల బంద్ కు ఎబివిపి పిలుపు..

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: అఖిల భారత విద్యార్థి పరిషత్(ఎబివిపి) సోమవారం(జూన్ 26) పాఠశాలల బంద్ కు పిలుపునిచ్చింది. తెలంగాణ‌లోని ప్రభుత్వ స్కూళ్లల్లో మౌళిక వసతుల కల్పనతోపాటు ప్రైవేట్ స్కూళ్లు వసూల్ చేస్తున్న అధిక ఫీజులను నియంత్రించాలని డిమాండ్ చేస్తూ రేపు రాష్ట్ర‌వ్యాప్తంగా ఎబివిపి బంద్ కు పిలిపునిచ్చింది.

ఈ సందర్భంగా ఎబివిపి రాష్ట్ర‌ నాయకులు శ్రీశైలం వీరమల్ల మీడియాతో మాట్లాడుతూ.. పాఠశాలలు తెరిచి 20 రోజులు కావస్తున్నా.. పాఠ్యపుస్తకాలు పంపిణీ చేయలేదని, చాలా పాఠశాలల్లో మౌలిక వసతులు లేవని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ప్రైవేట్ పాఠశాలల్లో సరైన ఫీజుల విధానం అమలు చేసేందుకు ఫీజు నియంత్రణ కమిటీ వేయాలని డిమాండ్‌ చేశారు.  రాష్ట్ర‌వ్యాప్తంగా నిర్వ‌హిస్తున్న‌ బంద్ ను విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిచ్చారు.

Also Read: బాలుర గురుకుల పాఠశాలలో ఫుడ్ పాయిజన్

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News