Monday, April 29, 2024

ఎపిలో సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసులలో ఎసిబి దాడుల కలకలం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్‌లోని పలు సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎసిబి దాడులు కలకలం రేపాయి. కడపలోని బద్వేల్, తుని, మేడికొండూరు, అనంతపురం, నర్సాపురం, జలమూరు, తిరుపతి, విశాఖ, నెల్లూరులోని కందుకూరు సహా పలు ప్రాంతాల్లో ఉన్న సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో ఎసిబి అధికారులు ఏకకాలంలో తనిఖీలు నిర్వహిం చారు. పలువురు సిబ్బంది అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చిన నేప థ్యంలో ఎసిబి దాడులకు అత్యంత ప్రాధాన్యతేర్పడింది. సబ్‌రిజిస్ట్రార్ ఆఫీసుల్లో రికార్డులను ఎసిబి అధికారులు నిశితంగా పరిశీలించారు. నంద్యాల మున్సిపల్ కార్యాలయంలోని పట్టణ ప్రణాళిక, రెవెన్యూ విభాగాల్లో ఆకస్మిక దాడులు చేశారు.

ఎసిబి డిఎస్‌పి శివనారాయణస్వామి నేతృత్వంలోని బృందం ఈ తనిఖీల్లో పాల్గొంది. నివాస గృహాలు, షాపింగ్ కాంప్లెక్స్‌లు, వాణిజ్య పరమైన భారీ భవంతుల నిర్మాణాలకు అనుమ తులు మంజూరు చేయడంలో, కొన్ని భవనాలను క్రమబద్ధీకరించడంలో సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారనే ఫోన్‌కాల్ ఫిర్యాదు మేరకు ఆకస్మిక తనిఖీకి ఏసీబీ అధికారులు నడుం బిగించారు. పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలోకి వెళ్లి తలుపులు మూసి రికార్డులను తనిఖీ చేశారు. రెండు విభాగాల్లో పనిచేస్తున్న సిబ్బందిని పూర్తిస్థాయిలో విచారించారు. తనిఖీలు జరుగుతున్న సమయంలో ఇతరులను ఎవరినీ లోపలికి అనుమతించలేదు. సచివాలయ వ్యవస్థ ఏర్పడ్డాక భవన నిర్మాణాలకు అనుమతులు, క్రమబద్ధీకరణ, కొత్త భవనాలకు పన్నుల విధింపు ఇలా ప్రతి అంశాన్ని సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంది.

సచివాలయాల్లో అప్‌లోడ్ అయిన పైళ్లు మున్సిపల్ కార్యాలయంలోని విభాగాలకు ఆన్‌లైన్‌లోనే సెక్షన్ ఇన్‌చార్జిల పరిశీలనకు చేరుతాయి. సెక్షన్ ఇన్‌చార్జిలు, సంబంధిత అధికారుల పరిశీలన పూర్తయిన తరువాత అనుమతుల మంజూరు, నిరాకరణ తదితర నిర్ణయాలు తీసుకుంటారు. అనుమతులు మంజూరైతే ఆన్‌లైన్ ద్వారానే సచివాలయాలకు వెళ్లి దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాలు తీసుకోవాలి. భవన నిర్మాణాల అనుమతుల కోసం సచివాలయాల నుంచి అప్‌లోడ్ అయిన దరఖాస్తులను పట్టణ ప్రణాళిక, రెవెన్యూ సెక్షన్లలో పనిచేస్తున్న సిబ్బంది కుమ్మక్కై పరిశీలనలో తాత్సారం చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి.

అనుమతుల కోసం పట్టణ ప్రణాళిక విభాగంలోని సిబ్బందిని సంప్రదించాక వారు పైల్‌కు ఓ రేటు వంతున ముడుపులు తీసుకొని, నేరుగా సచివాలయాలకు వెళ్లి దగ్గరుండి అప్‌లోడ్ చేయించి, అనుమతులు మంజూరు చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తాయి. రెవెన్యూ సెక్షన్‌లో ఆస్తుల క్రయవిక్రయాలకు సంబంధించిన లావాదేవీలు జరిగినప్పుడు యజమానుల పేరు మార్పులకు ఫైల్‌కు వేలల్లో వసూలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. మున్సిపాలిటీలలో జరుగుతున్న అవినీతి అక్రమాలపై టోల్ ఫ్రీ నెంబర్‌కు ఫోన్ ద్వారా ఫిర్యాదులు వెళ్లడంతో ఎసిబి అధికారులు రంగంలో దిగి విచారణ చేయడం అధికార వర్గాల్లో కలకలం రేపింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News