Sunday, April 28, 2024

బాలిక కిడ్నాప్, రేప్ కేసులో నిందితుడికి జీవిత ఖైదు

- Advertisement -
- Advertisement -

Accused jailed for life in girl kidnapping rape case

 

మనతెలంగాణ, హైదరాబాద్ : బాలికను కిడ్నాప్ చేసి అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి జీవిత ఖైదు, రూ.10,000 జరిమానా విధిస్తూ ఎల్‌బి నగర్ కోర్టు సోమవారం తీర్పు చెప్పింది. పోలీసుల కథనం ప్రకారం…సరూర్‌నగర్ మండలం,కర్మాన్‌ఘాట్, భూపేష్ గుప్తా నగర్‌కు చెందిన వడ్ల రవికుమార్ కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. సరూర్‌నగర్‌కు చెందిన బాలిక(14) ప్రేమించానని, పెళ్లి చేసుకుంటానని చెప్పి వెంటబడ్డాడు. నిందితుడికి అప్పటికే వివాహమైంది. అయినా కూడా బాలికను తీసుకుని సదాశివపేటకు వెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారం చేశాడు. బాధితురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న మీర్‌పేట పోలీసులు దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. నిందితుడిపై ఐపిసి366,376, పోక్సో యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. ఐఓ బిక్షం యాదవ్ కేసు దర్యాప్తు చేసి కోర్టులో ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జీ సురేష్ నిందితుడికి శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడే విధంగా చేసిన పోలీసులను రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. అడిషనల్ పిపి రాజిరెడ్డిని ఎల్‌బి నగర్ డిసిపి సన్‌ప్రీత్‌సింగ్, ఎసిపి వనస్థలిపురం, మీర్‌పేట ఇన్స్‌స్పెక్టర్ అభినందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News