Monday, April 29, 2024

డ్రగ్స్‌కేసులో సినీనటుడు నవదీప్‌కు ఊరట

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: డ్రగ్స్ కొనుగోలు చేసిన కేసులో సినీ నటుడు నవదీప్‌కు కోర్టు నుంచి ఊరట లభించింది. నైజీరియన్లు నుంచి సినీ నటుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ బయటపెట్టిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి సినీ నిర్మాత ఉప్పల రవీ, సినీ నటుడు నవదీప్ పరారీలో ఉన్నారు. ఇందులో సినీ నిర్మాత రవి పరారీలో ఉండగా, తనను అరెస్టు చేయవద్దని నవదీప్ హైకోర్టులో పిటీషన్ వేశాడు. దీంతో కోర్టు సినీనటుడు నవదీప్‌ను అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో ఇప్పటికే డ్రగ్స్ వాడిన పలువురు నిందితులను పోలీసులు రిమాండ్‌కు తరలించారు. డ్రగ్స్ కేసు విచారణలో భాగంగా హీరో నవదీప్‌కు కూడా నార్కోటిక్ పోలీసులు నోటీసులు జారీ చేయనున్నారని తెలుస్తోంది.

పోలీసులకు అందుబాటులోనే ఉన్నానని నవదీప్ గురువారం తెలిపిన విషయం విధితమే. మరోవైపు షాడో సినిమా యూనిట్‌మెన్ ఉప్పలపాటి రవి ఇంకా పరారీలోనే ఉన్నారు. ఇదిలావుండగా డ్రగ్స్ అరికట్టడమే లక్ష్యంగా పలు పబ్బులపైనా నార్కోటిక్ పోలీసుల నిఘా పెట్టారు. గచ్చిబౌలిలోని స్నార్ట్ పబ్, జూబ్లీహిల్స్‌లోని టెర్రా కేఫ్ అండ్ బిస్ట్రోలో డ్రగ్స్ విక్రయాలపై ఆరా తీస్తున్నారు. పరారీలో ఉన్న మోడల్ శ్వేత కోసం నార్కోటిక్ పోలీసుల గాలిస్తున్నారు. కేపీ చౌదరి లిస్ట్‌లోనూ మోడల్ శ్వేతా పేరు ఉండడం గమనార్హం. మరోవైపు ఈవెంట్ ఆర్గనైజర్ కలహార్ రెడ్డి కోసం నార్కోటిక్ పోలీసుల వేటాడుతున్నారు. కేపీ చౌదరి లిస్ట్‌తో పాటు గతంలో బెంగళూరు డ్రగ్స్ కేస్‌లోనూ కలహార్ రెడ్డి పేరు ఉండడం గమనార్హం.
డ్రగ్స్ విక్రయాలు
సులభంగా డబ్బులు సంపాదించాలని పబ్బుల యజమానులు డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. మాదాపూర్ డ్రగ్స్ కేసులో పబ్బుల బాగోతాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. గతంలో కూడా పబ్బులపై పలు ఆరోపణలు ఉన్నాయి, డ్రగ్స్‌కు పబ్బులు కేంద్రంగా మారుతున్నాయని విమర్శలు వచ్చాయి. ఆహ్లాదం కోసం ఏర్పాటు చేసిన పబ్బులు క్రమంగా డ్రగ్స్‌కు నిలయంగా మారాయని గతంలో పలు ప్రజా సంఘాలు ఆందోళన చేసిన విషయం తెలిసిందే. హైటెక్స్‌లోని స్నాట్ (SNORT) పబ్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం స్నాట్ (snort) పబ్ ఓనర్ సూర్య పరారీలో ఉన్నాడు.

పబ్‌కి వచ్చే కస్టమర్లకు సూర్య డ్రగ్స్ విక్రయిస్తున్నట్లు బయటపడింది. జూబ్లీహిల్స్‌లోని టెర్రా కేఫ్ అండ్ బ్రిస్టో పబ్‌లోనూ డ్రగ్స్ విక్రయాలు జరిగాయి. దీంతో పబ్ ఓనర్ అర్జున్ పరారీలో ఉన్నాడని తెలుస్తోంది. సూర్య, అర్జున్‌ల కోసం పోలీసుల ముమ్మరంగా గాలిస్తున్నారు. న్యూసెన్స్‌కి కేరాఫ్ అడ్రస్‌గా స్నాట్ పబ్ మారిందనే ఆరోపణలున్నాయి. గతంలోనూ పలు కేసులు నమోదయ్యాయి. 2 నెలల పాటు స్నార్ట్ పబ్ సీజ్‌లోనే ఉంది. అయినప్పటికీ తీరు మార్చుకోలేదు. ఇప్పటివరకు డ్రగ్స్ కన్సూమింగ్ అడ్డాలుగా ఉన్న పబ్స్ ఇప్పుడు డ్రగ్స్ విక్రయ కేంద్రాలుగా మారడం ఆందోళన కలిగిస్తోంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News