Saturday, April 27, 2024

విజయవాడలో కనకదుర్గమ్మను దర్శించుకున్న అఖిల్

- Advertisement -
- Advertisement -

Akhil

విజయవాడ: అక్కినేని అఖిల్ నటించిన చిత్రం ‘మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్’ దసరా కానుకగా అక్టోబర్ 15న విడుదల కాబోతున్నది. ఇప్పటికే ఈ సినిమా టీజర్, ట్రైలర్, సింగిల్స్ అంచనాలకు ఊతం ఇచ్చాయి. ఈ చిత్రంలో పూజా హెగ్డే, అఖిల్ జంటగా నటించారు. ఈ నేపథ్యంలో అఖిల్ గురువారం విజయవాడలోని కనకదుర్గమ్మ గుడిని దర్శించుకున్నారు. సినిమా విజయవంతం కావడానికి దైవానుగ్రహం కోసం ఆయన ఈ దర్శనం చేసుకున్నట్లు తెలుస్తోంది. నవరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని ప్రత్యేక పూజలు కూడా చేయించారని సమాచారం.

‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమా అఖిల్‌కు నాలుగవ సినిమా. ఇదివరలో అతడి సినిమాలు హలో, అఖిల్, మిస్టర్ మజ్ను పరజాయల్ని చూశాయి. ఈ సినిమాతోనైనా నిలదొక్కుకోవాలన్న పట్టుదలతో అతడున్నాడు. ఈ తాజా సినిమా ఎంత మేరకు ప్రేక్షకాదరణ పొందుతుందో చూద్దాం.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News