Sunday, April 28, 2024

బిఆర్‌ఎస్‌లో చేరికలు

- Advertisement -
- Advertisement -

నాగర్‌కర్నూల్ : నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తిమ్మాజిపేట మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ మైనార్టీ నాయకులు, కార్యకర్తలు గురువారం కాంగ్రెస్ పార్టీని వీడి బిఆర్‌ఎస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి జనార్ధన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరి సహకారంతో నాగర్‌కర్నూల్ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకుందామని అన్నారు. ఈ కార్యక్రమంలో బిఆర్‌ఎస్ పార్టీలో చేరిన కాంగ్రెస్ నాయకులు టైలర్ జాంగీర్, జనిమియా, చాంద్ పాషా, రహీం పాషా, మన్సూర్‌తో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News