Saturday, April 27, 2024

గతేడాది ప్రేమ వివాహం.. ఆత్మహత్య చేసుకున్న దంపతులు

- Advertisement -
- Advertisement -

ఆదిలాబాద్ జిల్లా గుడిహట్నూర్ మండలం కొలార్హిలో శనివారం విషాదం చోటుచేసుకుంది. పురుగుల మందుతాగి దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్య చేసుకున్న దంపతులను పల్లివి(22), విజయ్(24)గా గుర్తించారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో పల్లివి పురుగుల మందు తాగింది. భార్యమరణం తట్టుకోలేక భర్త విజయ్ కూడా పురుగుల మందు తాగాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా దారి మధ్యలోనే విజయ్ మరణించాడు. గతేడాది మేలో పల్లవి, విజయ్ ప్రేమ వివాహం చేసుకున్నారు. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News