Monday, April 29, 2024

చీరకట్టులో మనోహరంగా…

- Advertisement -
- Advertisement -

Aditi Rao Hydari shining in a sari

 

శర్వానంద్-, సిద్ధార్థ్ హీరోలుగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘మహాసముద్రం’. ‘ఆర్‌ఎక్స్ 100’ ఫేమ్ దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అదితి రావు హైదరి, – అను ఇమ్మాన్యుయేల్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా అక్టోబర్ 14న ఈ చిత్రాన్ని థియేట్రికల్ రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలుపెట్టిన మేకర్స్.. తాజాగా సెకండ్ సింగిల్ అప్‌డేట్ ఇచ్చారు. ఈ చిత్రంలోని ‘చెప్పకే.. చెప్పకే..’ అనే సాంగ్‌ని ఈనెల 6న విడుదల చేయనున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. ఈ క్లాసీ మెలోడీకి సంగీత దర్శకుడు చైతన్ భరద్వాజ్ స్వరాలు సమకూర్చారు. సాంగ్ అనౌన్స్ మెంట్ సందర్భంగా ఓ బ్యూటిఫుల్ పోస్టర్‌ని వదిలారు. ఇందులో చీర కట్టులో ఉన్న అదితి రావు హైదరి అందంగా కనిపిస్తోంది. సముద్రపు ఒడ్డున కూర్చొని మనోహరంగా దర్శనమిచ్చింది. ఇంటెన్స్ లవ్ అండ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ సినిమాని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై సుంకర రామబ్రహ్మం భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News