Friday, May 17, 2024

ఆ జ్ఞాపకాలు మరువలేనివి

- Advertisement -
- Advertisement -

Adivi sesh says about Major movie shoot

 

అడివి శేష్ హీరోగా నటిస్తున్న తొలి పాన్ ఇండియన్ మూవీ ‘మేజర్’. ఇప్పటికే ఈ సినిమా చిత్రీకరణ 90 శాతం పూర్తయింది. ఈ సినిమా షూటింగ్ తిరిగి ప్రారంభం కానుంది. “మేజర్ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించనున్నామని తెలియజేసేందుకు చాలా సంతోషిస్తున్నాను. గత ఏడాది చిట్కుల్ (హిమాచల్‌ప్రదేశ్‌లోని కిన్నూరు జిల్లాలోని ఓ ప్రాంతం)లో ‘మేజర్’ చిత్రీకరణ మొదలైంది. అక్కడ అంతగా చలిగా ఏం లేదు. కానీ ఆ ప్రాంతపు విజువల్స్, అక్కడివారితో ఉన్న జ్ఞాపకాలు మరువలేనివి. జూలైలో ‘మేజర్’ సినిమా షూటింగ్‌ను తిరిగి మొదలు పెట్టడానికి చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను. అమరవీరుడు మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితం ఆధారంగా ‘మేజర్’ చిత్రం రూపొందుతోంది”అంటూ చిత్ర నిర్మాత శరత్‌తో ఉన్న ఫోటోను షేర్ చేశాడు అడివి శేష్.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News