Saturday, April 27, 2024

కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ డాక్టర్ మృతి..

- Advertisement -
- Advertisement -

AIIMS Delhi Doctor JN Pande

 

న్యూఢిల్లీ: మహమ్మారి కరోనా వైరస్ మరో డాక్టర్‌ని బలి తీసుకుంది. నోవల్ కరోనాతో ఢిల్లీ ఎయిమ్స్ సీనియర్ డాక్టర్ జితేంద్రనాత్ పాండే శనివారం మృతిచెందారు. ఈ విషయాన్ని అపోలో హాస్పిటల్స్ గ్రూప్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ సంగీత రెడ్డి తెలిపారు. ‘కరోనాతో డాక్టర్ జిఎన్ పాండే మరణించిన వార్తా తనకు చాలా భాద కలిగించిందన్నారు. ఎయిమ్స్‌లో ఆయన పల్మోనాలజీ విభాగానికి డైరెక్టర్‌గా పనిచేశారు. వైద్య ప్రపంచానికి బలమైన వ్యక్తిని కోల్పోయాం. పల్మోనాలజీలో ఆయన చేసిన కృషి చాలా మందికి మంచి ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని ట్వీట్టర్ లో ఆమె పేర్కొంది.

AIIMS Delhi Doctor JN Pande Dies due to Covid 19

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News