Sunday, May 5, 2024

ఢిల్లీ రైతు సంఘాల్లో చీలిక..

- Advertisement -
- Advertisement -

AIKSCC and BKU withdraw from farmers protest: VM Singh

న్యూఢిల్లీ: ఢిల్లీ రైతు సంఘాల్లో చీలిక ఏర్పడింది. ఆందోళన నుంచి తాము తప్పుకుంటున్నట్లు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ విఎం సింగ్ తెలిపారు. రిపబ్లిక్ డే సందర్భంగా నిన్న రైతు సంఘాలు చేపట్టిన ట్రాక్టర్ పరేడ్ లో చోటుచేసుకున్న హింసాత్మక ఘటన నేపథ్యంలో బుధవారం విఎం సింగ్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విఎం సింగ్ మాట్లాడుతూ.. ‘రిపబ్లిక్ డేను అగౌరవపరచడం మా ఉద్దశం కాదు. ఇలాంటి ఆందోళనలు ఆమోదయోగ్యం కాదు.  రాకేష్ తికాయత్ తో కలిసి ఆందోళన చేయలేం. ఆందోళనకు నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం వేరుగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆందోళన కొనసాగించలేం. తాము ఆందోళన నుంచి తప్పుకుంటున్నాం’ అని స్పష్టం చేశారు.

AIKSCC and BKU withdraw from farmers protest: VM Singh

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News