Monday, April 29, 2024

పవన్‌తో భేటి..జనసేనలోకి అంబటి రాయుడు

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాలు కీలక మలుపులు తిరుగుతున్నాయి. ప్రముఖ క్రికెటర్ అంబటి రాయుడు జనసేన పార్టీలో చేరబోతున్నట్టు సంకేతాలు అందుతున్నాయి. బుధవారం రాయుడు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ తో భేటి అయ్యారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పలువురు నేతలు పార్టీలు మారుతున్న నేపధ్యంలో జనసేనపై కూడా పలువురు దృష్టిపెట్టారు. ఇటీవలే అధికార వైసీపీకి క్రికెటర్ అంబటి రాయుడు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. పార్టీలోకి చేరిన ఎనిమిది రోజులకే వైసీపీని వీడాడు. కొన్ని రోజులు రాజకీయాలకు దూరంగా ఉండనున్నట్లు ప్రకటించారు.

ఇంతలోనే అనూహ్యంగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌తో భేటీ అవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రస్తుతం పవన్‌తో రాయుడి భేటీ హాట్‌టాపిక్‌గా మారింది. జనసేన పార్టీ కార్యాలయంలో పవన్‌తో కలిసి భోజనం చేసిన రాయుడు సుమారు రెండు గంటల పాటు చర్చించారు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేసేందుకు ఆసక్తి చూపుతున్న ఆయనకు జనసేన నుంచి టిక్కెట్ హామీ లభించినట్టు తెలిసింది. పవన్ కళ్యాణ్‌తో సమావేశం అనంతరం అంబటి రాయుడు మీడియాతో మాట్లాడకుండా మౌనంగా వెళ్లిపోయారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News