- Advertisement -
న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో కరోనా ఉద్ధృతి కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో కరోనా పరిస్థితులపై చర్చించేందుకు కేంద్ర హోం శాఖమంత్రి అమిత్ షా నేతృత్వంలో సోమవారం ఢిల్లీ అఖిలపక్ష సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి బిఎస్పి, ఆమ్ఆద్మీ, కాంగ్రెస్ పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఢిల్లీలో కరోనా వైరస్ కట్టడికి తీసుకోవాల్సిన చర్యలపై సమావేశంలో చర్చిస్తున్నారు. ప్రతి ఒక్కరికి కరోనా పరీక్షలు నిర్వహించాలని, ఉపాధి కోల్పోయిన ప్రతీ కుటుంబానికి రూ.10వేలు ఇవ్వాలని కాంగ్రెస్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.
Amit Shah’s All Party Meeting on Corona Situation in Delhi
- Advertisement -