వినూత్న ఆలోచనకు ఆనంద్ మహీంద్రా ప్రశంసలు
న్యూఢిల్లీ: మహీంద్రా గ్రూప్ చైర్మన్ వినూత్న ఆవిష్కరణలు, ఆలోచనలను ఎప్పుడూ ప్రశంసిస్తూ, వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా మహారాష్ట్రకు చెందిన ఓ రైతు ఇంజినీర్లా మారి వినూత్న ఆవిష్కరణతో అందరినీ ఆశ్చర్యపర్చాడు. చేతులతో పనిలేకుండా ఆవులు, గేదెల నుంచి పాలు పితికే యంత్రాన్ని రూపొందించాడు. ఇలాంటి యంత్రాలు ఇప్పటికే మార్కెట్లో ఉన్నా వాటి ధర ఎక్కువగా ఉన్నాయి. అందుకే ట్రాక్టర్నే మిల్కింగ్ మెషిన్గా మార్చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అయింది. దీనిని ఆనంద్ మహీంద్రా తన ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు.
People keep sending me clips of how our tractors are used as ‘multi-tasking’ beasts of burden in rural areas. This one was a new one for me. Can the non-engineers amongst you figure out what essentially they have rigged out here? pic.twitter.com/OcKRYWXDyK
— anand mahindra (@anandmahindra) August 5, 2020