ముంబయి: క్రూయిజ్షిప్ డ్రగ్స్ కేసులో బాలీవుడ్ నటి అనన్యపాండే శుక్రవారం కూడా మాదక ద్రవ్యాల నియంత్రణ బ్యూరో(ఎన్సిబి) ముందు హాజరయ్యారు. ఇదే కేసులో అరెస్టయిన ఆర్యన్ఖాన్తో డ్రగ్స్ గురించి అనన్య వాట్సాప్ చాట్ చేసినట్టు ఎన్సిబి గుర్తించింది. గురువారం ఆమెను ఎన్సిబి అధికారులు రెండు గంటలపాటు ప్రశ్నించారు. ల్యాప్టాప్, మొబైల్ఫోన్ను జప్తు చేశారు. మరింత సమాచారం రాబట్టడం కోసం శుక్రవారం మరోసారి రావాలని ఎన్సిబి ఆమెను ఆదేశించడంతో తండ్రి చుంకీపాండేతో కలిసి సాయంత్రం 220కి దక్షిణముంబయిలోని ఏజెన్సీ కార్యాలయానికి ఆమె చేరుకున్నారు. అనన్య అక్కడికి చేరుకునే సమయంలో ఆఫీస్ బయట భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. ఆర్యన్తో వాట్సాప్ చాట్లో గంజాయి గురించి ఇద్దరి మధ్యా చర్చ జరిగినట్టు ఎన్సిబి వర్గాలు చెబుతున్నాయి. ఆర్యన్కు గంజాయి ఏర్పాటు చేస్తానని అనన్య అన్నట్టు తెలిపాయి. చాట్కు సంబంధించిన సాక్షాలు చూపించడంతో జోక్గా అలా అన్నానని, తాను ఏనాడూ గంజాయి తీసుకోలేదని దర్యాప్తు అధికారులతో అనన్య చెప్పినట్టు తెలుస్తోంది. ఆర్యన్ సోదరి సుహానాకు అనన్య స్నేహితురాలు. డ్రగ్స్కు సంబంధించి ఆర్యన్, అనన్య మధ్య నిరంతరం చర్చలు జరిగేవని ఎన్సిబి వర్గాలు చెబుతున్నాయి.