- Advertisement -
హైదరాబాద్ : రోజురోజుకు కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో వ్యాధి లక్షణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య కూడా పెరుగుతోంది. తాజాగా బుధవారం కరోరా వైరస్ లక్షణాలతో గాంధీ ఆసుపత్రిలో ఐదు మంది, ఫీవర్ ఆసుపత్రిలో నలుగురు చేరారు. వీరి నమూనాలను సేకరించిన వైద్యులు గాంధీలోని వైరాలజి ల్యాబ్లో కరోనా, స్వైన్ఫ్లూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. మంగళవారం కరోనా లక్షణాలతో నలుగురు గాంధీ ఆసుపత్రిలో చేరగా, వారి నుంచి రక్తనమూనాలు సేకరించిన వైద్యులు పరీక్షలు నిర్వహించారు. వారిలో ఇద్దరికి స్వైన్ఫ్లూ ఉందని తేలగా వారికి స్వైన్ఫ్లూ ప్రత్యేక వార్డులో చికిత్స అందిస్తున్నారు. మరో ఇద్దరిని డిశ్చార్జ్ చేశారు.
Another nine Coronaviruses suspects in hyderabad
- Advertisement -