- Advertisement -
హైదరాబాద్: ఇప్పటి వరకు తెలంగాణలో ఒకే ఒక్క కరోనా కేసు నమోదైందని పబ్లిక్ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అతడి బంధువులు, అతడితో ప్రయాణించిన వారు, అతడికి చికిత్స అందించిన సిబ్బందికి కూడా 18 గంటల్లో పరీక్షలు నిర్వహించామని, కేవలం రెండు శాంపిల్స్ మాత్రమే మరింత విశ్లేషణ కోసం పంపించామన్నారు. వాటి వివరాలు రేపు మనకు అందుతాయని, డిసెంబర్ 15 నుంచి కరోనా వైరస్ ఇష్టమున్నట్లు ప్రచారం చేస్తున్నారని, అవి సరికాదని హెచ్చరించారు. కరోనా వల్ల మరణం సంభవించడం అత్యంత అరదని, రెండు, మూడు శాతం లోపే మరణాలు నమోదయ్యాయని, వైరస్ లక్షణాలకు అనుగుణంగా చికిత్స అందిస్తున్నామని, కరోనా బారిన పడుతున్నది విదేశాల నుంచి వచ్చిన వారేనని, కరోనా వైరస్ గాలి ద్వారా అంటుకునేది కాదన్నారు.
- Advertisement -