Saturday, April 27, 2024

ఎంపి విజయసాయిరెడ్డికి కరోనా పాజిటివ్..

- Advertisement -
- Advertisement -

AP MP Vijayasai Reddy Test positive for Corona

మనతెలంగాణ/హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డికి కరోనా బారిన పడ్డారు. ఎపిలో ఇప్పటికే నలుగురు ఎంఎల్‌ఎలు కరోనా బారిన పడిన విషయం విదితమే. కాగా ఎపిలో కరోనా వైరస్ విజృంభించడంతో మంగళవారం నాడు 62 మంది మృత్యువాత పడ్డారు. ఇదిలావుండగా ఎపిలో రోజు రోజుకు రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. ఈ క్రమంలో సామాన్యులతో పాటు సినీ స్టార్లు, రాజకీయ నేతలు కూడా కరోనా బారినపడుతున్నారు. తాజాగా వైఎస్సాఆర్ కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డితో పాటు పాటు ఆయన పిఎకు సైతం కరోనా పాజిటివ్ వచ్చినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ క్రమంలో ఆయన సెల్ఫ్ క్వారంటైన్‌లోకు వెళ్లిపోయారు. వారం నుంచి 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలని నిర్ణయించుకున్నట్లు ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు

AP MP Vijayasai Reddy Test positive for Corona

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News