- Advertisement -
రాంచీ: భారత స్టార్ ఆర్చార్లు దీపిక కుమారి, అతాను దాస్ల వివాహం జార్ఖండ్ రాజధాని రాంచీలో జరిగింది. రెండేళ్ల క్రితమే వీరిద్దరి నిశ్చితార్థం జరిగింది. కాగా ప్రస్తుతం కరోనా విజృంభణ తీవ్ర స్థాయిలో ఉన్న నేపథ్యంలో కొద్ది మంది కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. ఈ సందర్భంగా సామాజిక దూర నిబంధనలను పాటిస్తూ దీపిక,అతాను దాస్ వివాహం చేసుకున్నారు.
ఈ వివాహానికి జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. దీపిక, అతాను దాస్ చాలా ఏళ్లుగా ప్రేమించుకుంటున్నారు. రెండేళ్ల క్రితమే వీరి ఎంగేజ్మెంట్ జరిగింది. కాగా, టోక్యో ఒలింపిక్స్ తర్వాత వివాహం చేసుకోవాలని గతంలోనే నిర్ణయించుకున్నారు. ఇదిలావుండగా ఈ ఏడాది ఒలింపిక్స్ వాయిదా పడడంతో ఇద్దరు ఆర్చర్లు పెళ్లి బంధంతో ఒక్కటయ్యారు.
- Advertisement -