- Advertisement -
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన జో బిడెన్ తన ప్రధాన వైద్య సలహాదారుగా, కొవిడ్-19 సలహా బృందంలో సభ్యునిగా డాక్టర్ ఆంటోని ఫౌసీని నియమిస్తున్నట్లు ప్రకటించారు. కరోనా వైరస్ వ్యాక్సిన్ విషయంలో ప్రజలలో విశ్వాసాన్ని పాదుగొల్పాల్సిన అవసరం గురించి తాను డాక్టర్ ఫౌసీతో మాట్లాడానని, సురక్షితమైన వ్యాక్సిన్ ప్రజలకు అందుబాటులోకి వస్తే అంతకన్నా ఆనందకరమైన విషయం ఏముంటుందని సిఎన్ఎన్కు ఇచ్చిన ఇంటర్వూలో బైడెన్ పేర్కొన్నారు. కరోనా వైరస్పై పోరాటం కోసం ఆర్థిక వ్యవస్థను మూసివేయాల్సిన అవసరం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. వైరస్ను దేశం నుంచి తరిమివేయడానికి ప్రజలు 100 రోజులు తప్పనిసరిగా ఫేస్ మాస్క్ ధరించాలని తాను పదవీ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా పిలుపు నిస్తానని ఆయన చెప్పారు.
- Advertisement -