Monday, April 29, 2024

యుపిలో ఘోర రోడ్డు ప్రమాదం: 15 మంది మృతి

- Advertisement -
- Advertisement -

15 మంది మృతి 21 మందికి గాయాలు

At least 15 dead in road accident

బారాబంకి(యుపి): ఉత్తర్ ప్రదేశ్‌లోని బారాబంకి జిల్లాకు చెందిన బబూరి గ్రామ సమీపంలో గురువారం తెల్లవారుజామున ప్రయాణికులతో వెళుతున్న బస్సు ఒక ఇసుక లారీని ఢీకొన్న ప్రమాదంలో 15 మంది మరణించారు. మరో 21 మంది గాయపడ్డారు. 70 మంది ప్రయాణికులతో ఢిల్లీ నుంచి బహ్రాయిచ్‌కు బస్సు వెళుతుండగా అడ్డం వచ్చిన ఆవును తప్పించబోయి బస్సు డ్రైవర్ ఇసుక లారీని ఢీకొన్నాడని బారాబంకి ఎస్‌పి యమునా ప్రసాద్ తెలిపారు. ఈ ప్రమాదంలో 9 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా మరో ఆరుగురు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారని ఆయన చెప్పారు. మృతులను ఇంకా గుర్తించవలసి ఉందని ఆయన తెలిపారు. ఇలా ఉండగా&బస్సు ప్రమాదం ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ మృతులకు సంతాపం ప్రకటించారు. మరణించినవారి కుటుంబాలకు రూ. 2లక్షల చొప్పున, క్షతగాత్రులకు రూ.50,000 చొప్పున ఆయన ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News