Monday, April 29, 2024

డెట్టాల్, ఎన్డీటీవీ అంబాసిడర్ గా ఆయుష్మాన్ ఖురానా

- Advertisement -
- Advertisement -

ముంబయి: అత్యంత విశ్వశనీయమైన న్యూస్ నెట్ వర్క్, NDTV, విజయవంతమైన 10వ సీజన్ ‘బనేగా స్వస్త్ ఇండియా’తో మళ్లీ వచ్చింది. ఇది భారతదేశపు అతి పెద్ద ప్రజా ఆరోగ్యం గురించిన ప్రచారం. భారతదేశం వ్యాప్తంగా ఆరోగ్యం, సంక్షేమం, ఐక్యతలను ప్రోత్సహించడానికి ఈ మైలురాయి సమయం ఒక దశాబ్దపు అచంచలమైన నిబద్ధతకు చిహ్నంగా నిలిచింది. ‘బనేగా స్వస్త్ ఇండియా’ డెట్టాల్ భాగస్వామ్యంతో ‘NDTVలో తొమ్మిదేళ్ల క్రితం ఆరంభమైంది. గత 9 ఏళ్లల్లో, ఈ బహుళ పురస్కారాల – విజయవంతమైన ప్రచారం ప్రతి ఒక్కరి జీవితాల్లో పరిశుభ్రత అనేది ఒక విడదీయలేని భాగంగా చేసే లక్ష్యంతో భారతదేశంలో ఎన్నో కార్యక్రమాలు, ఆవిష్కరణలు, కార్యకలాపాలు, సాధనాలు ద్వారా 24 మిలియన్ కు పైగా పిల్లలను చేరుకుంది.

తమ 10వ సంవత్సరంలో, ఈ ప్రచారం 10- పది యొక్క సామర్థ్యం శక్తితో అంతర్జాతీయ ఆరోగ్యం,సంక్షేమం కోసం ఒక ప్రపంచ పరిశుభ్రత పై శ్రద్ధవహిస్తుంది. బనేగా స్వస్త్ ఇండియా ప్రచారం శక్తులు, నేర్చుకున్నవి, అనుభవాలు, సాధించిన విజయాలను ప్రధానాంశంగా తెలియచేస్తుంది. ఒకే ప్రపంచ పరిశుభ్రత ప్రాధమిక లక్ష్యం ఏమంటే అవసరమైన పరిశుభ్రతా వ్యవస్థలు అందుబాటులో లేని వారికి సానుభూతి, సంఘీభావం చూపించాలని గుర్తు చేసే ఒక కార్యక్రమం. ప్రత్యేకమైన హక్కులు కలిగిన, సేవలు అందుబాటులో లేని వారి మధ్య అంతరాన్ని తగ్గించి, ప్రతి ఒక్కరూ ఆరోగ్యవంతమైన జీవితాన్ని కొనసాగించడాన్ని నిర్థారించడానికి తీసుకోవలసిన చర్య ఇది. 10వ సీజన్ దస్ కదమ్ (పది అడుగులు) – అభివృద్ధి చెందుతున్న సవాళ్లను పరిష్కరించాలని లక్ష్యం కలిగిన ప్రచారం.

డెట్టాల్, NDTV వారి ‘బనేగా స్వస్త్ ఇండియా’ చొరవ శక్తివంతంగా మారింది. లక్షలాది ప్రజలకు ఆశా కిరణంగా మారింది. దేశంలో అత్యంత ముఖ్యమైన కొన్ని ఆరోగ్య సమస్యలను పరిష్కరించి, చర్య తీసుకోవడానికి ఉప రాష్ట్రపతులు నుండి, ముఖ్యమంత్రులు వరకు, ఆస్కార్ విజేతలు, మెగాసేసే గ్రహీతలు, నోబెల్ లారియెట్స్, సానుభూతి గల వ్యక్తులు వరకు ఈ లక్ష్యానికి తమ మద్దతులో అత్యంత శక్తివంతమైన, ప్రభావితమైన అభిప్రాయాలను ఆకర్షించిన ఈ కార్యక్రమం ఒక వేదిక అని చెప్పవచ్చు. ప్రజా చైతన్యం పై తన ప్రభావానికి గాను ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ద్వారా ఈ చొరవ బహిరంగంగా గుర్తించబడింది. ఏటా అక్టోబర్ 2న ఈ ప్రత్యక్ష కార్యక్రమం, మెరుగైన పరిశుభ్రత, పోషకాహారం భారతదేశపు ఆరోగ్యాన్ని ఏ విధంగా మెరుగుపరుస్తుందో ప్రధానాంశంగా చూపిస్తుంది.

భారతదేశంవ్యాప్తంగా ఆరోగ్యం, సంక్షేమాలను ప్రోత్సహించడం పై శ్రద్ధవహించడం ద్వారా, 10వ సీజన్ కు గౌరవనీయ భారత రాష్ట్రతి ద్రౌపది ముర్ము, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, రోడ్ రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కారి, భారత ప్రభుత్వం, యూనియన్ జల శక్తి శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్, భారత ప్రభుత్వం, మేఘాలయ ముఖ్యమంత్రి కాన్ రాడ్ సంగమా, ఉత్తర్ ప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, మెడికల్ ఎడ్యుకేషన్, వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ కేబినెట్ మంత్రి, రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ హెహ్లాట్, లక్ష్మీ నారాయణ్ త్రిపాఠి, LGBTQIA కార్యకర్త వంటి ఎంతోమంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ ప్రసిద్ధి చెందిన అధికారులతో పాటు, రకుల్ ప్రీతి సింగ్, భూమి పడ్నేకర్ వంటి బాలీవుడ్ సెలబ్రిటీలు కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమంలో డేలర్ మెహందీ, నేహా కక్కర్, అధాన్ సామీ, సంచలనాత్మక నాగాల్యాండ్ ర్యాపర్ మోకో కోజా వంటి ఆకర్షణీయమైన కళాకారుల ప్రదర్శనలు కూడా ప్రదర్శించబడ్డాయి.

ప్రచారానికి అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న ఆయుష్మాన్ ఖురానా మాట్లాడుతూ.. “బనేగా స్వస్త్ ఇండియా అనేది గత 10 ఏళ్లకు పైగా ఆశ, చైతన్యం, సానుకూలమైన మార్పు యొక్క ప్రయాణంగా నిలిచింది. ఈ గొప్ప 10వ సీజన్ సందర్భంగా, ప్రచారం లక్ష్యాన్ని నెరవేర్చడానికి మనం దస్ కా దమ్ చేపడదాం. ఒక ప్రపంచం పరిశుభ్రత. ఆరోగ్యం అనేది వాస్తవంగా మన గొప్ప సంపద అని నేను గుర్తు చేస్తున్నాను. మనం కలిసికట్టుగా, ఆరోగ్యవంతమైన జీవితాలను జీవించడానికి, బలమైన, ఆరోగ్యవంతమైన భారతదేశం కోసం మనం లక్షలాదిమందిని ప్రేరేపించవచ్చు” అని అన్నారు.

సంజయ్ పుగాలియా, సీఈఓ, ఎడిటర్ ఇన్ ఛీఫ్, ఏఎంజీ మీడియా నెట్ వర్క్, డైరక్టర్, ఎన్డీటీవీ లిమిటెడ్ మాట్లాడుతూ.. “డెట్టాల్ బనేగా స్వస్త్ ఇండియా యొక్క ఈ విజయవంతమైన 10 వ సీజన్ తో మా కృతజ్ఞతను వ్యక్తీకరించాలని, ఒక ప్రపంచం పరిశుభ్రత కేవలం ఒక భావన కాదని ప్రజలకు అవగాహన కల్పించాలని కోరుకుంటున్నాం. ఇది ఆరోగ్యవంతమైన, సురక్షితమైన, మరింత సానుభూతితో కూడిన ప్రపంచానికి ఒక నిబద్ధత. మనం కలిసి కట్టుగా, హద్దులు అధిగమించి నిజం చేద్దాం. మన భవిష్యత్తు దాని పై ఆధారపడింది” అని అన్నారు.

క్రిస్ లిచ్ట్, ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ అధికారి, రెకిట్ మాట్లాడుతూ.. “మేము బనేగా స్వస్త్ ఇండియా గురించి ఎంతగానో గర్విస్తున్నాం. పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని అనుసరించడంలో మాతో చేరుతున్న భాగస్వాములకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మా 10 సంవత్సరాల ఈ భాగస్వామాన్ని గుర్తిస్తూ చేస్తున్న ఈ ముఖ్యమైన మైలురాయి సంబరం సందర్భంగా, మేము తప్పనిసరిగా ఆవిష్కరించడాన్ని కొనసాగిస్తాము. ఎవరినీ వదిలివేయకుండా నిర్థారించడం సహా బనేగా స్వస్త్ ఇండియాను మెరుగుపరచడానికి కొత్త మార్గాలను కనుగొంటాము” అని అన్నారు.

గౌరవ్ జైన్, ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, రెకిట్ దక్షిణాసియా.. “బనేగా స్వస్త్ ఇండియా యొక్క 10వ సీజన్ తో, ఆరోగ్యవంతమైన, భారతదేశపు ఉజ్జ్వలమైన భవిష్యత్తు కోసం ఒక ప్రపంచం పరిశుభ్రత మన అందర్నీ ప్రేరేపిస్తుంది. మేము భవిష్యత్తు పై శ్రద్ధవహిస్తాం, ఆరోగ్యవంతమైన భవిష్యత్తు కోసం అంతర్జాతీయ ఐక్యతను పోషిస్తాం” అని అన్నారు.

రవి భట్నాగర్ మాట్లాడుతూ..“బనేగా స్వస్త్ ఇండియా ఒక దశాబ్దపు నిరంతర అంకిత భావాన్ని సంబరం చేస్తున్న సందర్భంగా, రాబోయే తరాల వారి కోసం ఆరోగ్యవంతమైన గ్రహాన్ని నిర్థారించడానికి మనుష్యలు ఆరోగ్యం, పర్యావరణాన్ని కాపాడటానికి ఒక ప్రపంచ పరిశుభ్రత సుస్థిరమైన పరిశుభ్రతా పద్ధతులను ప్రోత్సహిస్తుంది. పరిశుభ్రమైన ప్రపంచం అనేది ఐక్యత, శక్తి, ఆరోగ్యవంతమైన ప్రపంచాన్ని నిరంతరంగా అనుసరించడంపై ఆధారపడింది” అని అన్నారు

సంవత్సరాలుగా, NDTV – డెట్టాల్ బనేగా స్వస్త్ ఇండియా ఎన్నో ప్రథమాలకు దారితీసింది అనగా పరిశుభ్రతా అంశం, హైజీన్ ఒలంపియాడ్, హైజీన్ ప్లే పార్క్స్, హైజీన్ మ్యూజిక్ ఆల్బమ్, భారతదేశపు మొట్ట మొదటి వాతావరణం తట్టుకునే పాఠశాలలు, జానపద కళలు, సాంస్కృతికంగా అనుకూలమైన పరిశుభ్రత కార్యక్రమాలను అందించడం వంటి వాటితో 850,000కి పైగా పాఠశాలలను చేరింది. కార్యక్రమంలో భాగంగా ఆన్ లైన్ గేమ్ హైజీయియాతో పాటు భారతదేశపు మొట్ట మొదటి ప్రజా ఆరోగ్యం, పరిశుభ్రతల పై శ్రద్ధవహించిన పాడ్ కాస్ట్ స్వస్త్య మంత్ర కూడా విడుదల చేయబడింది.

డెట్టాల్, NDTV లు పరిశుభ్రమైన, ఆరోగ్యవంతమైన భారతదేశం దిసగా 2014 నుండి పని చేస్తున్నాయి. తమ పదవ సీజన్ లో భాగంగా, బనేగా స్వస్త్ ఇండియా పరివర్తన ప్రయాణాన్ని ఆరంభించింది. ఈ ఏడాది లక్ష్యం ఏమంటే పూర్తి ప్రపంచాన్ని కవర్ చేయడం. మంచి పరిశుభ్రత & ఆరోగ్యాల లక్ష్యాలు అంతర్జాతీయ లక్ష్యంగా – ఒకే ప్రపంచ పరిశుభ్రత ఉండటం. ఈ సీజన్ లో, ఒక ప్రపంచ పరిశుభ్రత కోసం కొత్తగా ఏర్పడిన పద్మ అవార్డ్ గ్రహీత డాక్టర్స్ మండలి ఒక ప్రపంచ పరిశుభ్రత కోసం ప్రణాళిక చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News