Wednesday, May 1, 2024

మరో రెస్టారెంట్ ప్రారంభించిన బాబా కా ఢాబా ప్రసాద్

- Advertisement -
- Advertisement -

Baba Ka Dhaba Prasad who opened another Restaurant

 

న్యూఢిల్లీ: బాబా కా ఢాబా యజమాని కాంటా ప్రసాద్(80) ఢిల్లీలోని మాలవ్యానగర్‌లో మరో రెస్టారెంట్‌ను ప్రారంభించారు. ప్రస్తుతం తాను నడుపుతున్న హోటల్‌కు సమీపంలోనే దీనిని ఏర్పాటు చేసినట్టు ప్రసాద్ తెలిపారు. భారతీయ వంటకాలతోపాటు చైనా వంటకాలను కూడా తమ నూతన రెస్టారెంట్‌లో అందిస్తామని ఆయన తెలిపారు. అందుకోసం ఇద్దరు చెఫ్‌లను ఏర్పాటు చేశామని తెలిపారు. రెండు రోజుల్లో కిచెన్ ఏర్పాటు చేసి, బుధవారం నుంచి వినియోగదారులకు సేవలు ప్రారంభిస్తామని సామాజిక కార్యకర్త తుషాంత్ అద్లాఖా తెలిపారు. ప్రసాద్‌తోపాటు రెస్టారెంట్ల నిర్వహణలో అద్లాఖా కూడా పని చేస్తున్నారు. ప్రసాద్ కుటుంబసభ్యులు కూడా హాటల్ పనులు చేస్తున్నారు. లాక్‌డౌన్ కాలంలో తాను నడిపే చిన్న హోటల్ మూత పడటం వల్ల కుటుంబం ఇబ్బందులనెదుర్కొంటున్నదంటూ ఓ వీడియో వైరల్ కావడంతో బాబా కా ఢాబా గురించి ప్రచారం జరిగింది. ప్రచారం కల్పించిన యూట్యూబర్ సహాయమందించేవాళ్ల నుంచి వచ్చే డబ్బులు అతని అనుయాయుల ఖాతాల్లో పడేలా చేసి తనను మోసగించాడని ప్రసాద్ ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేయడం తెలిసిందే. ఆ వివాదం ముగియడంతో వృద్ధుడైన ప్రసాద్ జీవితం తిరిగి గాడిలో పడింది.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News