Friday, April 26, 2024

టీమిండియాకు కొత్త జెర్సీ

- Advertisement -
- Advertisement -

BCCI has announced finalization of new jersey for Team India

 

ముంబై: ఆస్ట్రేలియా పర్యటనలో టీమిండియాకు కొత్త జెర్సీని ఖరారు చేసినట్టు భారత క్రికెట్ బోర్డు (బిసిసిఐ) మంగళవారం అధికారికంగా ప్రకటించింది. ఈ సిరీస్‌లో భారత జట్టు కొత్త జెర్సీతో బరిలోకి దిగుతోందని బోర్డు అధికారులు ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ మేరకు ప్రముఖ స్పోర్ట్ విక్రయ సంస్థ ఎంపిఎల్‌తో బిసిసిఐ ఒప్పందం కుదుర్చుకొంది. ఈ ఏడాది నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు ఈ ఒప్పందం కొనసాగుతోందిన బోర్డు తెలిపింది. ఇప్పటి వరకు స్పాన్సర్‌గా ఉన్న నైక్‌తో ఒప్పందం ముగియడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు బోర్డు వివరించింది. త్వరలోనే కొత్త జెర్సీలకు సంబంధించిన ఫొటోలను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. సీనియర్ పురుషుల జట్టుతో పాటు జాతీయ మహిళా జట్టు, అండర్19 జట్ల క్రికెటర్లు ఈ జెర్సీలను వాడుతారు. ఇక క్రీడా పరికరాల తయారీలో ఎంపిఎల్‌కు ఎంతో పేరుందని, దీంతో వారితో జెర్సీలకు సంబంధించిన ఒప్పందాన్ని కుదుర్చుకున్నట్టు బోర్డు అధికారులు పేర్కొన్నారు.

 

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News