Monday, April 29, 2024

ఇండియా, మిడిల్ ఈస్ట్ ఆఫ్రికా మేనేజింగ్ డైరెక్టర్‌గా భావన బింద్రా నియామకం

- Advertisement -
- Advertisement -

ఇండియా, మిడిల్ ఈస్ట్ & ఆఫ్రికా (IMEA) మేనేజింగ్ డైరెక్టర్‌గా భావన బింద్రా ను నియమించినట్లు లుబ్రిజోల్ కార్పొరేషన్ వెల్లడించింది. లుబ్రిజోల్ దూకుడైన వృద్ధి లక్ష్యాలకు, ప్రాంతం పట్ల కొనసాగుతున్న నిబద్ధతకు కొత్తగా సృష్టించబడిన ఈ బాధ్యతలు మద్దతు ఇవ్వనున్నాయి. తయారీ పరిశ్రమలో రెండు దశాబ్దాల అనుభవం, REHAU, కమ్మిన్స్ ఇండియా వంటి ప్రసిద్ధ కంపెనీలతో కలిసి పని చేయడంతో, భావన తన నాయకత్వ పటిమ, పరిశ్రమ నైపుణ్యాన్ని ఈ ప్రాంతంలో లుబ్రిజోల్ వృద్ధిని నడపడానికి ఉపయోగించనున్నారు.

లుబ్రిజోల్ IMEA మేనేజింగ్ డైరెక్టర్‌గా, స్థానికం కోసం స్థానిక విధానం ఆధారంగా లూబ్రిజోల్, దాని కస్టమర్‌లకు ప్రాంతీయ వృద్ధిని అందించడానికి కంపెనీ IMEA బృందానికి నాయకత్వం వహించే బాధ్యతను భావన కలిగి వుంటారు. స్థానికీకరించిన మార్కెట్ అవకాశాలకు మద్దతు ఇవ్వడానికి, ప్రాంతంలోని కస్టమర్‌లు, సరఫరాదారులు, వాటాదారులతో సంబంధాలను బలోపేతం చేయడానికి కంపెనీ అంతటా లుబ్రిజోల్ లీడర్ షిప్ టీం తో కలిసి భావన పని చేస్తారు. ఆమె భారతదేశంలోని పూణేలో కొత్త గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్‌ను కూడా పర్యవేక్షించనున్నారు. ఇది ప్రాంతీయ వృద్ధికి లుబ్రిజోల్ సామర్థ్యాలను పెంచే ప్రాంతీయ కేంద్రంగా పనిచేస్తుంది.

“భారతదేశం, మధ్యప్రాచ్యం, ఆఫ్రికా అంతటా విజయవంతమైన సుదీర్ఘ చరిత్రను లుబ్రిజోల్ కలిగి ఉంది, ఈ ప్రాంతాలలో మా కస్టమర్‌లు, భాగస్వాములకు మా మద్దతును మరింతగా పెంచడానికి, బలోపేతం చేయడానికి మేము ఎదురుచూస్తున్నాము” అని లుబ్రిజోల్‌లోని హై గ్రోత్ రీజియన్స్ ఎస్ విపి, జెటి జోన్స్ అన్నారు. “మేము ఈ ప్రాంతం అంతటా అద్భుతమైన ప్రతిభను కలిగి ఉన్నాము, మా బృందాన్ని, మా కార్యకలాపాలను ఈ ప్రాంతం అంతటా విస్తరించడానికి ఎదురుచూస్తున్నాము” అని అన్నారు.

ప్రపంచంలోనే అతిపెద్ద CPVC రెసిన్ ప్లాంట్ గా 2025లో కార్యకలాపాలు ప్రారంభించనున్న, భారతదేశంలోని విలాయత్‌లో ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక CPVC రెసిన్ ప్లాంట్‌తో కలిపి, వృద్ధిని వేగవంతం చేయడానికి భారతదేశంలో $150 మిలియన్ల పెట్టుబడి నిబద్ధతతో సహా, ఈ నియామకం ఈ ప్రాంతం పట్ల లుబ్రిజోల్ యొక్క నిబద్ధతను కొనసాగిస్తుంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News