Sunday, April 28, 2024

గ్రూప్ 1 పరీక్షకు తొలిసారి బయోమెట్రిక్ ఫీచర్

- Advertisement -
- Advertisement -

Biometric feature for first time for Group 1 examination

మనతెలంగాణ/ హైదరాబాద్ : రాష్ట్రవ్యాప్తంగా 1019 కేంద్రాల్లో 3.8 లక్షల మంది అభ్యర్థులు ప్రిలిమ్స్ పరీక్షలకు హాజరవుతున్నారని, పరీక్ష సజావుగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ ఆదేశించారు. మంగళవారం బిఆర్‌కెఆర్ భవన్‌లో రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ డా.బి.జనార్దన్‌రెడ్డి, డిజిపి మహేందర్‌రెడ్డిలతో కలిసి జిల్లా కలెక్టర్లు, పోలీస్ కమిషనర్లు, ఎస్పీలతో గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష నిర్వహణకు సంబంధించి ఏర్పాట్లపై ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రిలిమినరీ పరీక్ష ఈ నెల 16న జరగనుంది. స్ట్రాంగ్ రూమ్‌లను గుర్తించి, పోలీసు రక్షణ ఏర్పాట్లుపై సంబంధిత శాఖ అధికారులతో జిల్లా కలెక్టర్లు సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. ఈ పరీక్షల కోసం తొలిసారిగా ప్రవేశపెట్టిన బయోమెట్రిక్ ఫీచర్‌పై అభ్యర్థులకు అవగాహన కల్పించేందుకు విలేకరుల సమావేశం ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్లను సిఎస్ ఆదేశించారు.

అభ్యర్థులు కూడా హాల్ టిక్కెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని, చివరి నిమిషంలో ఆలస్యం జరగకుండా ఉండేందుకు నిర్ణీత సమయానికి ముందుగానే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాల వద్ద తాగునీరు, పారిశుధ్యం తదితర ఏర్పాట్లు చేయాలన్నారు. స్ట్రాంగ్ రూమ్ ఇంచార్జ్ లు, రూట్ ఆఫీసర్లు, లైజన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ లైజన్ ఆఫీసర్లు, చీఫ్ సూపరింటెండెంట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఇచ్చిన చెక్ లిస్ట్ ప్రకారం సూచనలను పాటించాలని అన్నారు. టిఎస్‌పిఎస్‌సి కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కేంద్రాలలో 16వ తేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు జరగాల్సిన ప్రిలిమినరీ టెస్ట్ (ఆబ్జెక్టివ్ టైప్) కోసం అభ్యర్థులు వారి హాల్ టిక్కెట్‌లను టిఎస్‌పిఎస్‌సి కమిషన్ వెబ్‌సైట్ https://www.tspsc.gov.in ద్వారా డౌన్ లోడ్ చేసుకోవాలని సూచించారు.ఈ టెలికాన్ఫరెన్స్‌లో టిఎస్‌పిఎస్‌సి కార్యదర్శి అనితారామచంద్రన్, జిఎడి సెక్రటరీ శేషాద్రి, పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ నవీన్ మిట్టల్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News