Monday, May 6, 2024

స్నేహితులతో కలిసి యువతిపై అత్యాచారం చేసిన బిజెపి నాయకుడు

- Advertisement -
- Advertisement -

BJP Leader rape on women with Friends

భోపాల్: బిజెపి నాయకుడు తన స్నేహితులతో కలిసి ఓ అమ్మాయిని కిడ్నాప్ చేసి రెండు రోజులు పాటు ఆమెపై సామూహిక అత్యాచారం చేసిన సంఘటన మధ్య ప్రదేశ్‌లోని శందోల్ జిల్లాలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… గడాఘట్ ప్రాంతంలో ఈనెల 18వ తేదీన బిజెపి నాయకుడు విజయ్ త్రిపాఠీ తన స్నేహితులతో కలిసి అమ్మాయిని కారులో కిడ్నాప్ చేశారు. అనంతరం అమ్మాయిని ఫామ్‌హౌస్‌కు తీసుకెళ్లి మద్యం తాగించి రెండు రోజులు పాటు సామూహిక అత్యాచారం చేశారు. ఈ నెల 20వ తేదీన ఆమెను ఇంటి ముందు వదిలి వెళ్లిపోయారు. తన తల్లిదండ్రులతో కలిసి జైత్‌పూర్ పోలీస్ స్టేషన్‌లో యువతి ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని అదనపు ఎస్‌పి పేర్కొన్నారు. విజయ్ త్రిపాఠీని పార్టీ నుంచి బిజెపి సస్పెండ్ చేసింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News