Monday, April 29, 2024

యుపిలో బిజెపి ఎంపి కుమారుడిపై కాల్పులు

- Advertisement -
- Advertisement -

BJP MP Kaushal Kishore son shot in lucknow

లక్నో: ఉత్తర్ ప్రదేశ్‌లోని మోహన్‌లాల్‌గంజ్ నియోజకవర్గం బిజెపి ఎంపి కౌశల్ కిషోర్ కుమారుడు ఆయుష్(30) కాల్పులలో గాయపడ్డారు. ఆయుష్‌పై ఆయన బావమరిది కాల్పులు జరిపినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే ఈ సంఘటన వెనుక గల కారణాలు ఇంకా తెలియరాలేదని పోలీసులు చెప్పారు. మదియాన్ ప్రాంతంలో ఈ సంఘటన జరిగిందని, ఆయుష్‌ను వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అనంతరం డిశ్చార్జ్ చేశారని వారు తెలిపారు. ఈ సంఘటనపై ఎటువంటి ఫిర్యాదు రాలేదని, ఈ కాల్పులలో ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత కేసు నమోదు చేసే విషయం పరిశీలిస్తామని లక్నో పోలీసు కమిషనర్ డికె ఠాకూర్ తెలిపారు.

BJP MP Kaushal Kishore son shot in lucknow

BJP MP Kaushal Kishore son shot in lucknow

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News