Monday, April 29, 2024

బాబ్లీ గేట్లు ఎత్తివేత

- Advertisement -
- Advertisement -
14గేట్లను పైకెత్తిన మహారాష్ట్ర
తెలంగాణ నీటి పారుదల శాఖ అధికారులు

మన తెలంగాణ/మెండోరా: మహారాష్ట్రలో గోదావరి నదిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు 14 గేట్లను శనివారం పైకి ఎత్తి 0. 47 టిఎంసిల నీటిని మహారాష్ట్ర, తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు విడుదల చేశారు. దీంతో గోదావరి జలాలు శ్రీ రాంసాగర్ ప్రాజెక్టు వైపు పరుగులు తీస్తున్నాయి. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ సుప్రీంకోర్టు ఒప్పందం ప్రకారం ప్రతి సంవత్సరం జులై 1 నుంచి అక్టోబర్ 28వ తేదీ వరకు గేట్లను తెరిచి ఉంచుతారని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిడబ్లూసి ఈఈ ప్రజీత్, సిడబ్లూసి ఎస్‌డిఇ బన్సోద్ బాబ్లీ, డిఈఈ ఎం. చక్రపాణి, ఎస్‌ఆర్‌ఎస్‌పి ఈఈ ఎం. వంశీ, ఎఇఇ తదితరులు పాల్గొన్నారు.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News