Monday, April 29, 2024

పెళ్లైన 24 గంటల్లోనే పెళ్లికుమారుడి మృతి

- Advertisement -
- Advertisement -
bridegroom died within 24 hours of wedding
విషమ పరిస్థితిలో పెళ్లికుమార్తె

హైదరాబాద్‌ః నగర శివారులోని శేరిలింగంపల్లిలో విషాదం చోటు చేసుకుంది. వివాహం జరిగిన 24 గంటలకే రోడ్డు ప్రమాదంలో పెళ్లి కుమారుడు శ్రీనివాస్ మృతి చెందాడు. ఈక్రమంలో చెన్నైలో ఉన్న అత్తగారి ఇంటికి వెళుతుండగా బుధవారం నాడు ఈ ప్రమాదం చోటుచేసుకుంది. పెళ్లి కుమారుడు శ్రీనివాస్ కారు నడుపుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో పెళ్లి కూతురు కనిమొళికి సైతం తీవ్రగాయాలు కావడంతో కోమాలోకి వెళ్లింది. హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన శ్రీనివాస్ కు చెన్నైకి చెందిన కనిమొళితో తిరుపతిలో వివాహం జరిగింది. కుటుంబసభ్యులు, బంధువులతో ఎంతో సందడిగా ఉన్న ఇంట్లో ఒక్కసారిగా విషాదఛాయులు అలుముకున్నాయి. ఈ నవ జంట ప్రయాణిస్తున్న కారు బెంగళూరు దగ్గర అదుపు తప్పడంతో ప్రమాదం జరిగింది. తీవ్ర గాయాలతో ఉన్న వధూవరులను ఆసుపత్రికి తరలించగా శ్రీనివాస్ చనిపోయాడు. అతడి భార్య కోమాలో ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News