Monday, April 29, 2024

బిఆర్‌ఎస్ కార్యకర్త కుటుంబానికి అండగా నిలిచిన ఎంఎల్ఎ

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: బిఆర్‌ఎస్ పార్టీ కార్యకర్త కుటుంబానికి దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి అండగా నిలిచారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన బిఆర్‌ఏస్ కార్యకర్త ఉదగిరి కేశవులు కుటుంబానికి రైతుబీమా చెక్కు రూ.5,00,000లు, బిఆర్‌ఎస్ పార్టీ ప్రమాద బీమా చెక్కు రూ.2,00,000లతో పాటు సిద్ధయ్యపల్లిలో డబుల్ బెడ్ రూంను ఎమ్మెల్యే మంజూరు చేయించారు.

మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గం భూత్‌పూర్ మున్సిపల్ పరిధిలోని సిద్దాయపల్లిలో బిఆర్‌ఎస్ కార్యకర్త ఉదగిరి కేశవులు రోడ్డు ప్రమాదంలో మృత్యువాతపడ్డారు. రైతుబీమా, పార్టీ ఇన్సూరెన్స్ చెక్కును నేరుగా కార్యకర్త ఇంటికి వెళ్లి మృతుడి భార్య భూదేవికి మొత్తం రూ.7 లక్షల చెక్కులను అందజేసి డబుల్ బెడ్ రూంను మంజూరు పత్రాన్ని ఆయన అందించారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News