Monday, April 29, 2024

ఈసీ అనుమతిస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ చేస్తాం

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్: నిర్మల్ జిల్లాలో భారత రాష్ట్ర సమితి ప్రజా ఆశీర్వాద సభను గురువారం నిర్వహించింది. ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కెసిఆర్ పాల్గొని ప్రసంగిస్తూ…. దేశంలోనే మొదటిసారిగా దళిత బంధు స్కీమ్ తెచ్చాం, 24 గంటలూ నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నమని కెసిఆర్ వెల్లడించారు. ఈసీ అనుమతిస్తే ఇప్పుడే రైతు రుణమాఫీ పూర్తి చేస్తామని ఆయన పేర్కొన్నారు. రైతుబంధు దుబారా అని ఉత్తమ్ కుమార్ అంటున్నారు. రైతులకు 3గంటలు కరెంట్ చాలని రేవంత్ రెడ్డి అంటున్నారు. ధరణి తీసేస్తే… రైతుబంధు, రైతుబీమా కూడా పోతాయి, ధరణి తీసేస్తే.. మళ్లీ దళారుల రాజ్యం వస్తుందని సిఎం కెసిఆర్ తెలిపారు.

నష్టం వచ్చినా రైతుల వద్ద పంట కొంటున్నామన్నారు. గిరిజనులకు నాలుగు లక్షల ఎకరాలకు పోడు పట్టాలు ఇచ్చామని వెల్లడించారు. అభివృద్ధి కొనసాగాలంటే… మళ్లీ భారాస గెలవాలన్నారు. తెలంగాణ ఉన్నంత వరకు తెలంగాణ సెక్యులర్ గా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. తెలంగాణలో ఇవాళ 3 కోట్ల టన్నుల ధాన్యం పండుతోందన్నారు. ధాన్యం దిగుబడిలో త్వరలోనే తెలంగాణ రాష్ట్ర పంజాబ్ ను అధిగమిస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నిర్మల్ జిల్లా కావాలని ఇంద్రకరణ్ రెడ్డి తపనపడ్డారని ఆయన వెల్లడించారు. ఇంద్రకరణ్ రెడ్డి మెజారిటీ 80 వేలు దాటాలని కెసిఆర్ సూచించారు. పదేళ్లుగా శాంతియుతంగా రాష్ట్రాన్ని పాలిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే బిఆర్ఎస్ పుట్టిందన్నారు సిఎం కెసిఆర్. 15 ఏళ్లు నిర్విరామంగా పోరాడి తెలంగాణ సాధించుకున్నామన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News