Saturday, April 27, 2024

మారెమ్మ అమ్మవారి గుడిలో చోరీ

- Advertisement -
- Advertisement -

రాజోలి: రాజోలి పరిధిలోని తుంగభ ద్ర నది ఒడ్డున ఉన్న చిన్న ధన్వాడ గ్రామంలో బుధవా రం మారెమ్మ అమ్మవారి దే వాలయంలో చోరీ జరిగిన ట్లు స్థానికుల ద్వారా తెలియ వచ్చింది. ఇటీవల కాలంలో అమ్మవారి గుడిని నూతనంగా నిర్మించి, అనేక మౌలిక వసతులతో కూడిన ఆల యంలో గుర్తు తెలి యని దుండగులు చొరబడి హుండి, బీరువాలను పగలగొట్టి అందులోని డబ్బుల ను దొంగిలించినట్లు ఎస్‌ఐ అబ్దుల్ ఖాదర్ తెలిపారు.

చోరీ జరిగిన విషయంను తెలుసుకున్న రాజోలి ఎస్‌ఐ హుటాహుటిన సంఘటన స్థ లానికి చేరుకొని, దుండగులు పగలగొట్టిన బీరువాను, హుండిలను పరిశీలించా రు. అనంతరం క్లూస్ టీంను సంఘటన స్థలానికి పిలిపించి, దుండగులను వేలి ముద్రలను సేకరించినట్లు ఆయన తెలిపారు.

దుండగులను త్వరలోనే పట్టుకొని న్యాయస్థానంలో హాజరు పరుస్తామని ఆయన తెలిపారు. చిన్న ధన్వాడ గ్రామ స్తులను అమ్మవారి గుడి దగ్గరికి పిలిపించి సైబర్ క్రైం అవేర్నెస్ గురించి తెలియజేయడం జరిగింది. ఎవరైనా సైబర్ నేరాల బారిన పడితే టోల్ ఫ్రీ నంబర్ 1930కి కాల్ చేయాల్సిందిగా వివరించడం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News