- Advertisement -
ముంబై: మహారాష్ట్రలో బుధవారం తెల్లవారుజామున ఘోరరోడ్డుప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరో 35 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం నందూర్బార్లోని ఆసుపత్రికి తరలించారు. గుజరాత్ లోని సూరత్ కు వెళ్లున్న బస్సు కొండైబరి ఘాట్ వద్ద అదుపుతప్పి లోయలోకి బోల్తా పడింది. ప్రస్తుతం సహాయక చర్యలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్లు వైద్యులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు.
bus rolled down a valley near Kondaibari Ghat
- Advertisement -