Friday, April 26, 2024

యాదాద్రి… రన్నింగ్ లో ఊడిపోయిన బస్సు చక్రాలు

- Advertisement -
- Advertisement -

యాదాద్రి భువనగిరి: బస్సు వెనుక చక్రాలు ఊడిపోయిన సంఘటన యాదాద్రి జిల్లాలోని రాయగిరి-మోత్కూర్ ప్రధాన రహదారిపై కాటేపల్లి వద్ద జరిగింది. బస్సు వేగం తక్కువగా ఉండడంతో పెను ప్రమాదం తప్పిందని ప్రయాణికులు తెలిపారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మంది వరకు ప్రయాణికులు ఉన్నారని, ఎటువంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.  తొర్రూర్ డిపో కి చెందిన టిఎస్ 26 జడ్ 0029 బస్సు హైదరాబాద్ నుంచి తొర్రూర్ కు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News