Saturday, April 27, 2024

జూబ్లీహిల్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారిని కత్తితో పొడిచి….

- Advertisement -
- Advertisement -

Business man attack on partner in Jublihills

హైదరాబాద్: భాగ్యనగరంలోని జూబ్లీహిల్స్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారిపై కత్తితో దాడి చేశాడు. డబ్బుల విషయంలో గొడవ జరగడంతోనే ఈ దాడి జరిగినట్టు సమాచారం. జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 78లో రవీందర్ రెడ్డి, అతడి బంధువు మోహన్ రెడ్డి ఓ స్థలాన్ని విక్రయించారు. కమీషన్ సొమ్ము రూ.6 లక్షలు విషయంలో ఇద్దరు మధ్య గొడవలు జరుగుతున్నాయి. బుధవారం ఉదయం ఇద్దరు మధ్యవాగ్వాదం జరగడంతో రవీందర్ రెడ్డిని మోహన్ రెడ్డి కత్తితో పొడిచాడు. మెహన్ రెడ్డిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. నిందితుడు మోహన్ రెడ్డి వెంటనే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో లొంగిపోయాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News