- Advertisement -
న్యూఢిల్లీ: స్పెక్ట్రమ్ వేలం విషయంలో కేంద్ర కేబినెట్ బుధవారం కీలక నిర్ణయం తీసుకుంది. 5జీ స్పెక్ట్రమ్ వేలానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించిన మార్గదర్శకాలకు కేంద్ర క్యాబినెట్ వెల్లడించింది. మార్చిలో 5వ తేదీన 5జి స్పెక్ట్రమ్ వేలాన్ని నిర్వహించనున్నట్టు కేంద్రం ప్రభుత్వం తెలిపింది. ఈ స్పెక్ట్రమ్ వేలం ద్వారా రూ. 3,92,332 కోట్ల ఆదాయం వస్తుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. 20 ఏళ్లకు పలు ఫ్రీక్వెన్సీ బ్యాండ్లలో 5జీ స్పెక్ట్రమ్ వేలానికి మంత్రివర్గం ఆమోదించింది. స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి ఈ నెలలోనే దరఖాస్తులు ఆహ్వానించనున్నట్టు టెలికాం శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ చెప్పారు.
Cabinet approves Auction of 5G spectrum
- Advertisement -