Monday, April 29, 2024

పోడు భూములపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ

- Advertisement -
- Advertisement -

Cabinet sub-committee meets on Podu lands

మనతెలంగాణ/హైదరాబాద్ : పోడు భూముల సమస్యకి శాశ్వత పరిష్కారం కోసం ముఖ్యమంత్రి కెసిఆర్, రాష్ట్ర గిరిజన, స్త్రీ- శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అధ్యక్షతన మంత్రులు ఇంద్ర కరణ్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, అజయ్ కుమార్‌లతో వేసిన క్యాబినెట్ సబ్ కమిటీ రెండో సమావేశం శుక్రవారం నాడు బూర్గుల రామకృష్ణారావు భవన్‌లో జరిగింది. ఈ సమావేశంలో అటవీ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి క్రిస్టినా, అటవీ శాఖ పిసిసీఎఫ్ శోభ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల్లో పోడు భూముల సమస్య – పరిష్కారం, తెలంగాణలో జిల్లాల వారీగా పోడు భూముల వివరాలు, గిరిజనులు, గిరిజనేతరులు సాగు చేస్తున్న పోడు పై కమిటీ చర్చించింది. ఈక్రమంలో అనతికాలంలో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News