Sunday, April 28, 2024

మహారాష్ట్రలో రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొట్టిన కారు..

- Advertisement -
- Advertisement -

మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నేవి ముంబయి మున్సిపల్ కార్పొరేషన్ భనవం సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు అదుపుతప్పి ట్రక్కును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సంఘటనాస్థలంలోనే ఒకరు ప్రాణాలు కోల్పోగా.. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. అనంతరం ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News