Wednesday, May 8, 2024

రేపటి నుంచి రూ.75 నాణెం

- Advertisement -
- Advertisement -

న్యూఢిల్లీ : దేశంలో రూ.75 విలువగల నాణెం ఆదివారం చలామణి కానుంది. కొత్త పార్లమెంట్ భవనాన్ని ప్రధాని మో డీ ఆదివారం ప్రారంభించే నేపథ్యంలో దీనికి గు ర్తుగా ఈ కొత్త నాణెం ప్రభుత్వం విడుదల చేస్తుంది. దీనికి సంబంధించి అధికారిక గె జిట్‌ను ఆర్థిక వ్యవహారాల శాఖ వెలువరించింది.

ఈ కొత్త కాయిన్ దాదాపుగా 35 గ్రాములు పైబడి ఉంటుంది. నాణెం ఓ వై పు అశోక చక్రం సింహం, మధ్యలో దేవనాగరి లిపిలో భారత్ పేరు, ఇంగ్లీషులో ఇం డియా పదం ఉంటాయి. రూపాయి గుర్తు, ఈ నాణెం మారక విలువ 75 అంకె ఉం టాయి. మరో వైపున నూతన పార్లమెంట్ భవనం ప్రాంగణం ప్రతిమ, దిగువన 2023 అంకెలు ఉంటాయి. రూ 75 నా ణెం దేశానికి స్వాతంత్య్ర సిద్ధికి ప్రతీకగా కూడా నిలుస్తుంది. ఈ నాణెం త్వరితగతిన తమ వంతుగా దక్కించుకోవాలని పౌ రులలో ఆసక్తి నెలకొంది.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News