- Advertisement -
మనతెలంగాణ/హైదరాబాద్ : రాష్ట్రంలో మరోసారి ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును పొడిగించినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి శుక్రవారం నాడు ప్రకటించింది. రాష్ట్రంలో నిర్వహించనున్న ఎంసెట్, ఇసెట్, లాసెట్, ఐసెట్, పిజి ఇసెట్, పిజి ఎల్సెట్, ఎడ్ సెట్, పిఇ సెట్ ప్రవేశ పరీక్షల దరఖాస్తు గడువును మరోసారి పొడిగించింది. ఎలాంటి ఆలస్య రుసుం లేకుండా ఈనెల 31వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి తెలిపింది, ఇదివరలో ఎలాంటి రుసుం లేకుండా 15వరకు ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువు ప్రకటించిన విద్యామండలి తాజాగా మరోసారి ఈనెల ఆఖరు వరకు పెంచుతూ ప్రకటన విడుదల చేసింది.
- Advertisement -