Saturday, April 27, 2024

ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్న చంద్రబాబు

- Advertisement -
- Advertisement -

అమరావతి: బుధవారం టిడిపి అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బాబు ఢిల్లీకి బయలుదేరనున్నారు. పొత్తులపై చర్చించడానికి ఢిల్లీకి రమ్మని చంద్రబాబుకి అమిత్ షా ఆహ్వానం పలికారు. బుధవారం రాత్రి బిజెపి అగ్రనేత అమిత్ షా, బిజెపి జాతీయ అధ్యక్షుడు జెపి నడ్డాలతో చంద్రబాబు భేటీ కానున్నారు. చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా ఢిల్లీకి వెళ్లే ఛాన్స్ ఉంది. చంద్రబాబు అమిత్ షా భేటీ తర్వాత పొత్తులపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. టిడిపితో పొత్తు పెట్టుకోవాలని హైకమాండ్‌కు ఇప్పటికే మెజార్టీ ఎపి బిజెపి నేతల సూచించారు. ఎపిలో బిజెపి టిడిపితో పొత్తు పెట్టుకొని రెండు, మూడు ఎంపి సీట్లు గెలువాలని  బిజెపి అధినాయకత్వం భావిస్తుందని రాజకీయ ప్రముఖులు అభిప్రాయ పడుతున్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News