Monday, April 29, 2024

ఛత్తీస్ గఢ్ లో ఎన్ కౌంటర్: ముగ్గురు మృతి

- Advertisement -
- Advertisement -

 

రాయ్ పూర్: చత్తీస్ గఢ్ రాష్టం సుక్మా జిల్లా జాగర్గుండ అటవీ ప్రాంతంలో ఆశ్రంపరలో ఎన్‌కౌంటర్ జరిగింది. ఈ ఘటనలో ముగ్గురు డిఆర్ జి జవాన్లు మృతి చెందారు. నక్సలైట్లు ఆయుధాలను కూడా ఎత్తుకెళ్లారు. కొందరు జవాన్లు కూడా గాయపడ్డారు. గాయపడిన జవాన్లను హెలికాప్టర్ ద్వారా తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. రాయ్ పూర్ లో 400 కిలో మీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఎఎస్ఐ రామురామ్ నాగ్, కానిస్టేబుల్ కుంజమ్ జోగా, వంజమ్ బీమా మృతి చెందారని పోలీస్ ఉన్నతాధికారులు పేర్కొన్నారు.

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News