- Advertisement -
బీజింగ్: చైనాలోని ఒక బొగ్గు గనిలో అధిక మోతాదులో కార్బన్ మోనాక్సైడ్ వాయువు కారణంగా 18 మంది కార్మికులు మరణించారు. శుక్రవారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో చాంగ్కింగ్ మునిసిపాలిటీలోని యాంగ్చున్ జిల్లాలో గల దయాషుడాంగ్ బొగ్గు గనిలో ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. కార్బన్ మోనాక్సైడ్ అధిక మోతాదులో ఉండడంతో ఆ వాయువును పీల్చి 18 మంది కార్మికులు మరణించినట్లు వారు చెప్పారు. గనిలో చిక్కుకున్న ఇతర కార్మికులను వెలుపలకు తీసుకురావడానికి పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
- Advertisement -