Monday, April 29, 2024

సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల

- Advertisement -
- Advertisement -

హైదరాబాద్ : సివిల్ సర్వీసెస్ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదలయ్యాయి. మొత్తం 1,105 సివిల్ సర్వీస్ ఉద్యోగాల భర్తీకి గత నెల 28న దేశవ్యాప్తంగా సివిల్స్ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించగా, మొత్తం 14,624 మంది ఉత్తీర్ణత సాధించారు. వీరంతా ఈ ఏడాది సెప్టెంబరు 15న జరిగే మెయిన్స్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హత సాధించారు. ప్రిలిమ్స్‌లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులు మెయిన్స్ పరీక్ష కోసం ఇప్పుడు మళ్లీ డిటైల్ అప్లికేషన్ ఫామ్ -1 దరఖాస్తు చేసుకోవాలని యుపిఎస్‌సి తెలిపింది. ఇందుకు చివరి తేదీని కమిషన్ త్వరలోనే వెల్లడించనుంది. ప్రిలిమ్స్ కటాఫ్, ఆన్సర్ కీని సివిల్స్ సర్వీసెస్ పరీక్ష మొత్తం ప్రక్రియ పూర్తయిన తర్వాత వెల్లడించనున్నట్లు యుపిఎస్‌సి. అభ్యర్థులు తమ ఫలితాలను upsc.gov.in వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు. ఫలితాలపై సందేహాల నివృత్తికి యుపిఎస్‌సి ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేసింది. అభ్యర్థులు 011-23385271, 011-23098543 లేదా 011-23381125 నెంబర్ల ద్వారా సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని యుపిఎస్‌సి వెల్లడించింది.

 

- Advertisement -

Related Articles

- Advertisement -

Latest News